కొవిడ్ కారణంగా మృతి చెందిన వారికి అంత్యక్రియలను నిర్వహించేందుకు ‘ఫీడ్ ద నీడి’ సంస్థ ముందుకు వచ్చింది. కార్యక్రమంలో భాగంగా మృతదేహాలను తరలించేందుకు ఓ ప్రత్యేక మైన అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. శనివారం రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ లాస్ట్ రైడ్ అంబులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభించారు. గత ఏడాది కరోనా సమయంలో ఈ లాస్ట్ రైడ్ ద్వారా దాదాపు 210 మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించారు. ఈ సేవలు కావాల్సిన వారు రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూమ్ నం.9490617234 లేదా ‘ఫీడ్ ద నీడి’ సంస్థ నం: 7995404040కు ఫోన్ చేయాలని సీపీ తెలిపారు. ఓ పది మంది సాఫ్ట్ వేర్ టెకీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ టీమ్లో సాయి తేజ, శ్రీనివాస్ బెల్లం, ప్రదీప్, ప్రశాంత్, వినయ్, రమణజీత్ సింగ్, ప్రదీప్, సురేంద్రలు ఉన్నారు. వీరు చేస్తున్న సేవలను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.