కరోనా వ్యాప్తి నేపధ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రంగారెడ్డి రీజియన్ పరిధిలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.నగరంలోని పలు ప్రాంతా లతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు,ఇతర రాష్ర్టాలకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తున్న నేపధ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో 72 ఫ్లాట్ ఫారంలతో నిత్యం 3 వేలకు పైగా బస్సులు వేల మందిని ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తుంది. ఎంజీబీఎస్కు చేరుకునే వారికే కాకుండా అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు,సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.ఎంజీబీఎస్ కారిడార్లతో పాటు ఫ్లాట్ ఫారాలపై నిత్యం శానిటేషన్ చేయడంతో పాటు చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బందితో ఎత్తి వేయిస్తున్నారు. ప్రవేశ మార్గాల వద్ద,అన్ని ఫ్లాట్ ఫారంల వద్ద హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేశారు.
రంగారెడ్డిరీజియన్ పరిధిలో పనిచేసే బస్ డ్రైవర్లు,కండక్టర్లకు,సిబ్బందికి కరోనా జాగ్రత్తల పట్ల నిత్యం అవగాహన కల్పిస్తున్నారు.నిత్యం విధి నిర్వహణలో కచ్చితంగా మాస్కు ధరించే ఉండాలని, కండక్టర్లు ఎప్పటికప్పుడు శానిటైజర్తో చేతులు పరిశుభ్ర పర్చుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ వరప్రసాద్ పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తి నేపధ్యంఓ ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటు న్నాం.నిత్యం పరిశుభభ్రతతో పాటు క్యారిడార్, ఫ్లాట్ఫారం, బస్సులు నిలిపే ప్రాంతాలను సోడియం హైపోక్లోరైడ్తో పిచికారీచేస్తున్నాం. – సరిరాం,సీనియర్ కస్టమర్ రిలేషన్ మేనేజర్,ఎంజీబీఎస్, జేబీఎస్.