బంజారాహిల్స్, జూన్ 1 : ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి అలియాస్ రవీంద్ర (32) బంజారాహిల్స్లోని ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మద్యానికి బానిసైన రవీంద్ర కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్నాడు. తాగుడు మాన్పించేందుకు అతన్ని నగరంలోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. కాగా.. గత నెల 28న అక్కడి నుంచి బయటకు వచ్చిన రవీంద్ర బంజారాహిల్స్లోని ఓ హోటలో గది తీసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆ గదిలో విగత జీవిగా పడి ఉండటాన్ని హోటల్ సిబ్బంది గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రవీంద్ర రక్తం వాంతులు చేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖాన మార్చూరీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.