మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శాసనసభ మాజీ సభాపతి మధుసూదనాచారి అన్నారు. యువకళావాహిని అధ్వర్యంలో అమీర్పేటలోని సారథి స్టూడియోస్ ప్రీవ్యూ థియేటర్లో సోమవారం డా.వా సిరెడ్డి సీతాదేవి మహిళా పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా రంగాల్లో నిష్ణాతులైన మహిళామణులను సముచితంగా గౌరవించేలా యువ కళావాహిని వారు మహిళా పురస్కారాలను అందజేయడం ప్రశంసనీయమన్నారు. ఆంధ్రా పెరల్ బక్ బిరుధు సొంతం చేసుకున్న వాసిరెడ్డి సీతాదేవి రచనలు ఎంతో గుర్తింపు పొందాయన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు సీతాదేవికి ఎన్నో పురస్కారాలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతకుముందు శైలజాసుమన్(ప్రసాద మాధ్యమం), వి.సుమిత్ర(సహకార రంగం), మహిహే జబీన్(కవిత్వం), డా.జ యప్రదా రామ్మూర్తి(సంగీతం), డా.అర్.ప్రసన్నరాణి(నృత్యం)లకు డా.వాసిరెడ్డి సీతాదేవి మహి ళా పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి హాజరైన న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఆకాశవాణి పూర్వ సంచాలకులు మంగళగిరి ఆదిత్యాప్రసాద్, ప్రముఖ నా ట్యాచార్యులు డా.ఎస్.పీ.భారతి, సారథి స్టూడియోస్ డైరెక్ట్ కె.వెంకటేశ్వర్రావు తదితరులు ప్రసంగిందరు. ఈ సందర్భంగా నృత్యోదయ కూచిపూడి డాన్స్ కాడమీ అధ్వర్యంలో ఎ.వృతి క, సీ.మాన్విరెడ్డి, జె.త్రిషితరెడ్డి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం చూపరులను అలరించింది. కార్యక్రమాన్ని యువకళావాహిని వ్యవస్థాపక అధ్యక్షులు వై.కె.నాగేశ్వర్రావు పర్యవేక్షించారు.