అమీర్పేట్: ఎర్రగడ్డ సమీపంలోని మోడల్కాలనీకి చెందిన మానవ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఎర్రగడ్డ మానసిక వ్యాధుల చికిత్సాలయంలో అటెండెంట్లకు ఉచిత భోజనాన్ని అందజేశారు. దాదాపు 300 మందికి పైగా అటెండెంట్లకు సమితి ద్వారా ఉచిత భోజనాన్ని అందించారు. ఎర్రగడ్డ మానసిక వ్యాధిగ్రస్తుల చికిత్సాలయంలో వైద్యం పొందేందుకు వచ్చే రోగులకు అటెండుంట్లుగా వస్తుండే వారికి సరైన భోజన వసతులు లేవు.
రోగులకు ఆసుపత్రి భోజనం అందిస్తుండగా.. అటెండెంట్లకు అందుబాటులో భోజనం చేయడానికి సరైన అవకాశాలు లేకపోవడంతో వారు ఆకలికి అలమటిస్తున్నారు. అలాంటి వారి ఆకలి తీర్చేందుకు మానవ సేవా సమితి.. హెల్పింగ్ హ్యాండ్ ఫర్ నీడీ పేరుతో అన్నార్థుల ఆకలి తీర్చేందుకు తమవంతు తోడ్పాటునందిస్తోంది. మానవ సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు కాలనీ వాసులతో పాటు పలువురు తమ వంతు తోడ్పాటును అందించేందుకు ముందుకు వస్తున్నారు.