దేవరకొండ/త్రిపురారం, మే 14 : నల్లగొండ జిల్లాలో శుక్రవారం కరోనాతో ముగ్గురు మృతిచెందారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, ఒకరు సర్పంచ్. దేవరకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు యాదగిరి (54), పెద్దఅడిశర్లపల్లి పశు వైద్యురాలు నాగమణి (38) కొవిడ్కు చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. త్రిపురారం మండలంలోని బెజ్జికల్ సర్పంచ్ ఇండ్ల కౌసల్య(48) కరోనాకు చికిత్స పొందుతూ చనిపోయారు.