ముంబై, జూన్ 12: తక్కువ ధరలో నాణ్యమైన బ్రాండ్ బ్యాండ్ సేవలకోసం ఎదురుచూస్తున్నారా..! అయితే ఈ ఆఫర్లు మీకోసమే… వోడాఫోన్ ఐడియా (వీఐ) టెలికాం సంస్థ ‘యు’ బ్రాడ్బ్యాండ్ పేరుతో బ్రాడ్బ్యాండ్ రంగంలోకి అడుగుపెట్టింది. కస్టమర్ బేస్ ను పెంచుకోవడం కోసం తన బ్రాడ్బ్యాండ్ ఆఫర్లను ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్లకు మార్కెట్ లో పోటీగా తన ఆఫర్లను అందిస్తున్నది.
రిలయన్స్ జియో ,భారతి ఎయిర్టెల్ ఆఫర్లతో పోలిస్తే వోడాఫోన్ ఐడియా ఏ ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్పీ)ఇవ్వని ప్లాన్లను తన కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు దాని ఆఫర్లను అప్ డేట్ చేసిన తరువాత వోడాఫోన్ ఐడియా ‘యు’బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ చాలా బాగున్నాయి. వోడాఫోన్ ఐడియాబ్రాడ్బ్యాండ్ సేవలు ప్రస్తుతం అందించే అనేక సర్కిల్లలో దాని ఆఫర్లను అప్ డేట్ చేస్తున్నది. ప్రస్తుతానికి అహ్మదాబాద్ లో మాత్రమే అప్ డేట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
‘యు’ బ్రాడ్బ్యాండ్ నుంచి లభించే మొదటి ప్లాన్ నెలకు రూ. 400ధరకు లభిస్తుంది. ఇది తన వినియోగదారులకు అపరిమిత డేటా (3.5TB ఎఫ్యుపి పరిమితి) ను 30Mbps వేగంతో అందిస్తుంది. కంపెనీ తన వినియోగదారులకు అందించే వై-ఫై రౌటర్ , మోడెమ్ కోసం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే కనెక్షన్లో ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేవు. ఇంకా ఈ ప్లాన్తో ఓవర్-ది-టాప్ ప్రయోజనాలు ఉండవు.
రెండో ప్లాన్ నెలకు రూ .679 ధరకు లభిస్తుంది. ఈ ప్లాన్ కూడా వినియోగదారులకు అదే 3.5TB FUP డేటాను 50 Mbps వేగంతో అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ లో కూడా ఎటువంటి OTT ప్రయోజనాలు లేవు. అయితే ఈ ప్లాన్లో అదనపు పన్నులు ఉంటాయి. 100 Mbps , 200 Mbps స్పీడ్తో సహా కొన్ని హై-స్పీడ్ ప్లాన్లను కూడా కంపెనీ అందిస్తుంది. ఇంకా అన్ని ప్లాన్లు ఒకే మొత్తంలో FUP డేటా (3.5TB) తో వస్తాయి. 100 Mbps ప్లాన్ నెలకు రూ.826 ధరకు లభిస్తుంది. అలాగే 200 Mbps ప్లాన్ నెలకు రూ.1,062 ధరకు వస్తుంది.వినియోగదారులు సంస్థ నుంచి వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు కానీ వారికి అదనపు ఛార్జీలు ఉంటాయి.