హైదరాబాద్ : గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) బస్డిపోలో లాజిస్టిక్, కొరియర్, కార్గో పార్శిల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒకపుడు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సేవలందించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) తాజాగా కార్గో సేవలకు శ్రీకారం చుట్టిన విషయం విధితమే. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందిస్తూనే ఆర్టీసీ ఇటీవల కార్గో పార్శిల్ సేవలు ప్రారంభించి బస్డిపోల వారీగా తన కార్యకలాపాలు విస్తరించింది. ఇందులో భాగంగా ఇటీవల గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) బస్డిపో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కార్గో సేవలు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సదరు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ప్రైవేటు సేవలతో పోలిస్తే తమ ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు నమ్మకమైన, భద్రతతో కూడిన మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తున్నదని వీటిని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ఐటీ కారిడార్కు చేరువలో ఉన్న హెచ్సీయూ బస్డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన ప్రజలకు కల్పించడంతో పాటు ప్రాంతాల వారీగా కౌంటర్లను ఏర్పాటుచేసి లాజిస్టిక్ సేవలను విస్తృత పరుస్తున్నారు. ఈ లాజిస్టిక్ సేవల్లో ప్రధానంగా పార్శిల్, కొరియర్స్, పుల్ట్రక్ సేవలు నియోగదారులకు అందిస్తున్నారు. ఇతర ప్రైవేట్ సంస్థల కార్గో సర్వీసు చార్జీల కంటే తక్కువగా ఆర్టీసీ నామమాత్రపు రుసుంతో తన కార్యకలాపాలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా సరే కేవలం 24 గంటల్లో ఆర్టీసీ ద్వారా ఈ లాజిస్టిక్ సేవలు అందించనున్నారు. ఇతర ప్రైవేట్ కొరియర్స్లో లేనివిధంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉండడంతో ఇతర లాజిస్టిక్ సంస్థల కంటే ఆర్టీసీ సేవలు వేగంగా వినియోగదారులకు చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంతో అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ముంబాయి, బెంగళూర్, మైసూర్, ఓడిస్సా తదితర రాష్ర్టాలకు సైతం సర్వీసులను విస్తరించిన ఆర్టీసీ ఈ లాజిస్టిక్ సేవలు విస్తరిస్తున్నది.
ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
ఈ లాజిస్టిక్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సెంట్రల్ యూనివర్సిటీ బస్డిపో పరిధిలో పలు ప్రత్యేక కౌంటర్లు సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ బస్డిపోతో పాటు లింగంపల్లి బస్స్టాండ్, మణికొండ, కోఠిలో కౌంటర్లు తెరిచి సేవలు అందిస్తున్నారు. ఆయా కౌంటర్లలో ఉదయం నుంచి సాయంత్రం ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉంటూ కొరియర్ కోసం సేవలను అందిస్తున్నారు. దీంతో పాటు హెచ్సీయూ డిపో పరిధిలో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయడం కోసం ఏజెంట్లకు సైతం అవకాశాలు అందిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొరియర్ సేవలు, మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్లు 9177683134, 7382858084లలో సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.
అన్ని ప్రాంతాలకు సేవలు
హెచ్సీయూ బస్డిపో లాజిస్టిక్ సేవలు సద్వినియోగపరుచుకోవాలి. మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికైనా 24 గంటల్లో ఆర్టీసీ కార్గో సేవలు అందుతాయి. పార్శిల్, కొరియర్, లాజిస్టిక్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రత్యేకంగా గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీ సంక్షేమ సంఘాల వారితో సైతం చర్చించాం. ఈ తరహా కాలనీ మొత్తం సంక్షేమ సంఘం ద్వారా ఎవరైనా తమను సంప్రదిస్తే పూర్తి స్థాయిలో డోర్ డెలివరీ సైతం అందిస్తాం. – పీ.శ్రీనివాస్, హెచ్సీయూ డిపో మేనేజర్