హైదరాబాద్, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్ ఉద్ధృతిని నివారించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను కఠినంగా అమలు చేయనున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. లాక్డౌన్ను పాటించకుండా చాలా మంది నగర రోడ్లపై తిరుగుతూ కరోనా వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ను పాటించకుండా రోడ్లపై చాలా మంది ఎలాంటి అవసరం లేకున్నా తిరుగుతున్నట్లు గుర్తించామని, అయితే, వైరస్ను నిరోధించాలంటే ఇలాంటి వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి పని లేకున్నా రోడ్లపై తిరిగితే వాహనం సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తామని ఆయన చెప్పారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ రోడ్లపైకి రావొద్దని ఆయన సూచించారు. కేవలం వైద్యారోగ్య విభాగం, మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లాక్డౌన్ను 30 వ తేదీ వరకు కఠినంగా అమలుచేస్తున్నందున ప్రతి ఒక్కరూ గమనించి తమతో సహకరించాలని అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు.
ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు అడ్హక్ జీతాలు, ఉత్తర్వులు జారీ
పీహెచ్ జ్యువెల్స్కు డీఆర్ఐ నోటీసుపై హైకోర్టు స్టే
అది కాపీరైట్ ఉల్లంఘనే: ఢిల్లీ హైకోర్టు
రెజ్లర్ సాగర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ అరెస్ట్
ఆఫ్ఘాన్లో జిల్లాను ఆక్రమించిన తాలిబాన్లు.. దాడుల్లో 40 మంది తాలిబాన్లు హతం
మార్స్పై పని మొదలుపెట్టిన చైనా రోవర్
సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు : జుంటా నేత హ్లింగ్
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
సువేందు అధికారి తండ్రి, సోదరుడికి వై ప్లస్ భద్రత
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..