హైదరాబాద్ : హైదరాబాద్ వ్యాప్తంగా లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో మొత్తం 276 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 50, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పలు చోట్ల లాక్డౌన్ను సీపీలు, డీసీపీలు పర్యవేక్షిస్తున్నారు. జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తున్నారు. అన్ని రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.