లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై హైదరాబాద్, రాచకొండ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి రెండు కమిషనరేట్లలో 50వేలకు పైగా ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25,684 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో లాక్డౌన్ ఉల్లంఘనలు 19,845 ఉండగా, మాస్కులు ధరించని వారు 4,430, సోషల్ డిస్టెన్స్ పాటించని వారు 933మందితో పాటు గుంపులుగా ఉన్న 353 మందిపై కేసులు నమోదయ్యాయి. బహిరంగ ప్రాంతాల్లో మద్యం, గుట్కా.. ఇతర పొగాకు ఉత్పత్తులను వాడిన 123మందిపై కేసులు నమోదు చేశారు.