సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ)/చార్మినార్ : నగర ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారనే అంశాలపై సీపీ అంజనీకుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మినహాయింపు పొందిన వారిని మాత్రమే రోడ్లపైకి అనుమతించాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా సౌత్జోన్పై దృష్టిపెట్టిన ఆయన శనివారం కూడా చార్మినార్ ప్రాంతంలో పర్యటించారు. నగర అదనపు సీపీ డీఎస్ చౌహాన్తో కలిసి చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఘాన్సీ బజార్, పటేల్ మార్కెట్, అగర్వాల్ కాలేజీ, హైకోర్టు, మదీనా, గుల్జర్హౌస్ మీదుగా చార్మినార్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. దక్షిణ మండలంతోపాటు నగర వ్యాప్తంగా లాక్డౌన్ సమయాల్లో ఎలాంటి వ్యాపార కేంద్రాలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అనంతరం కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) నుంచి నగర వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనల అమలు ఎలా సాగుతుందనే విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. మరో పక్క ట్రాఫిక్ ఈ చలాన్ విభాగం నుంచి కూడా రోడ్లపై రద్దీ ఎలా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రోడ్లపై రద్దీ కన్పిస్తే సీసీసీ నుంచి ఆయా కూడళ్లలోని సిబ్బందికి ఫోన్చేసి.. అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు.