తరిమికొట్టేందుకు అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం విదితమే. అయితే ముఖ్యమైన, అత్యవసర సేవలకు ఏ ఇబ్బందీ లేకుండా కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. ఉదయం 6 నుంచి 10 లోపు నిత్యావసర సరుకులు తెచ్చుకునే వీలు కల్పించింది. ఏ సంస్థ అయినా, ఏ కార్యాలయమైనా సరే తమ ముఖ్యమైన పనులకు ఆటంకం కలగకుండా ఆ 4 గంటలు పనిచేసుకోవచ్చు. ఈ నెల 12 నుంచి 22 వరకు అమలయ్యే లాక్డౌన్లో ప్రభుత్వం అనుమతించిన వారు తప్ప మిగిలిన వారెవరూ బయట తిరగడానికి వీళ్లేదు. కాగా లాక్డౌన్ నిర్ణయం ప్రకటించగానే మంగళవారం సాయంత్రం నగరంలోని అన్ని కిరాణా షాపుల్లో, మాల్స్లో విపరీతమైన రద్దీ కనిపించింది. ఇక వైన్షాపుల్లో మందుబాబులుచేంతాడంత క్యూలు కట్టి లైనులో నిలబడి మందు కొనుక్కున్నారు.
లాక్డౌన్కు ప్రతి ఒక్కరు సహకరించాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటాం. సడలింపు ఇచ్చారని ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనవసరంగా రోడ్లపైకి రావద్దు. తప్పని సరి పరిస్థితుల్లోనే ప్రభుత్వం లాక్డౌన్ పెట్టాల్సి వచ్చిందన్న విషయం మరిచిపోవద్దు. రోడ్లపైకి రాకుండా కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటే కరోనా చైన్ను తెగిపోతుంది. ఆ తరువాత అందరం హాయిగా తిరగొచ్చు. అన్ని జోన్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. సడలింపు ఉన్న వారు గుర్తింపు కార్డులు చూపితే అనుమతిస్తాం. – అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించం. ప్రతి 3 కిలోమీటర్లకు ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేస్తాం. సడలింపు సమయంలో ఎవరూ నిబంధనలను ఉల్లంఘించవద్దు. అపోహలు, అనుమానాలతో లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి రావద్దు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠినంగా ఉంటాం. అనుమతి ఉన్న వారే రోడ్లపై కి రావాలి. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన వారు కచ్చితంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తమ వెంట ధృవీకరణ పత్రాలు, ఐడీ కార్డులను వెంట పెట్టుకొని ప్రయాణించాలి. వ్యాక్సినేషన్కు వెళ్లే వారు తమ స్లాట్ పత్రాలను లేదా సమాచారాన్ని చూపించాలి. – విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 48 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాం. లాక్డౌన్ సమయంలో రోడ్లపై కి వస్తే విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసులను పెడతాం. సడలింపు సమయంలో కూడా
కచ్చితంగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. లేదంటే చర్యలు తప్పవు. వైద్య సేవలకు ఎలాంటి ఆడ్డంకులు ఉండవు. అందరూ సరిగ్గా 9.45 గంటల కల్లా దుకాణాలను మూసివేయాలి. –మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్