సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి శుక్రవారం 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తూ సీపీ సజ్జనార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.కల్లు దుకాణాలు, వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నింటిని రెండు రోజుల పాటు మూసివేయాలని సీపీ ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు.