హైదరాబాద్ : పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలో మద్యం విక్రయాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను బంద్ చేయాలని నిర్వాహకులను ఆదేశించింది. బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, రంగం కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం షాపులపై గట్టి నిఘా ఉంచుతామని తెలిపారు.