ఎల్బీనగర్/చంపాపేట, ఏప్రిల్ 30: లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల పోలింగ్ శుక్రవారం మందకొడిగా సాగింది. ఉదయం నుంచి ఓటర్లు వేటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. డివిజన్లో మొత్తం 47,379 ఓటర్లు ఉండగా, పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 57 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. కొవిడ్ కారణంగా ఓటర్లు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. బస్తీలలో మినహా కాలనీలలో పోలింగ్ శాతం అంతగా నమోదు కాలేదు.