జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన ఆకుల రమేశ్గౌడ్ కరోనాతో మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు తుదిగడువు 20వ తేదీ. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా, మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక ప్రక్రియ జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డివిజన్ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రో రోల్స్ విడుదల చేయడంతోపాటు ఉన్నతాధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు.