హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి చేత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
గత డిసెంబర్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్థిపై 1272 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు.