ఎల్బీనగర్, మే 3: లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర్రెడ్డి తన నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి మందుగుల అఖిల్ పవన్గౌడ్పై 1272 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. 2000 సంవత్సరంలో జరిగిన ఎల్బీనగర్ మున్సిపల్ ఎన్నికల్లో లింగోజిగూడ 18వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దరిపల్లి రాజశేఖర్రెడ్డి టీడీపీకి చెందిన చిత్తలూరి వెంకటేశ్వర్లు చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీ విలీనం అనంతరం నిర్వహించిన 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన దరిపల్లి రాజశేఖర్రెడ్డి టీఆర్ఎస్కు చెందిన ముద్రబోయిన శ్రీనివాస్రావు చేతిలో ఓడిపోయాడు. కాగా ఇటీవలే జీహెచ్ఎంసీ 2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున లింగోజిగూడ డివిజన్ నుంచి పోటీ చేసిన దరిపల్లి రాజశేఖర్రెడ్డి బీజేపీకి చెందిన ఆకుల రమేశ్ గౌడ్ చేతిలో ఓడిపోయాడు. అయితే దురదృష్టవశాత్తు ప్రమాణస్వీకారం చేయకుండానే ఆకుల రమేశ్గౌడ్ అనారోగ్యంతో మరణించడంతో లింగోజిగూడకు ఉప ఎన్నికలు వచ్చాయి. బీజేపీ వారి కోరిక మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగలేదు. లింగోజిగూడ డివిజన్ ప్రజల మద్దతును రాజశేఖర్రెడ్డి పొందగలిగారు. 20 ఏండ్ల నిరీక్షణ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర్రెడ్డి విజయం సాధించి లింగోజిగూడ కార్పొరేటర్గా మారారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీగా మారిన అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో 2009లో నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లు ఉండగా.. ఒకే ఒక్క సీటు గడ్డిఅన్నారం డివిజన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి బిచినేపల్లి సుభాషిని వెంకటేశ్వర్రావు కార్పొరేటర్గా గెలిచారు. అనంతరం 2016లో డివిజన్ల పునర్విభజన చేసిన అనంతరం ఏర్పడిన 11 జీహెచ్ఎంసీ డివిజన్లలో అన్నింటిలో టీఆర్ఎస్ కార్పొరేటర్లే పాగా వేశారు. తాజాగా 2020 డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అన్ని డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలుపొందారు. కాగా లింగోజిగూడ డివిజన్ నుంచి గెలిచిన రమేశ్గౌడ్ మరణంతో నిర్వహించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన దరిపల్లి రాజశేఖర్రెడ్డి గెలుపొంది.. కాంగ్రెస్ జెండా పాతారు.