కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తుంది.. ఈ క్రమంలో మహమ్మారి నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఇంజక్షన్ల విక్రయం కొనసాగుతుంది. ఈక్రమంలో మూసాపేటలోని ఔట్లెట్ వద్ద ఉదయం 3 గంటల నుంచే ప్రజలు క్యూలో నిలబడుతున్నారు. మహిళలు, పిల్లలు సైతం క్యూలో నిలబడి ఇంజక్షన్ను కొనుగోలు చేస్తున్నారు. రెమ్డెసివిర్ ఆరు డోస్లకు గాను రూ.24,500 లను వసూలు చేస్తున్నారు. ఔట్లెట్ వద్దకు భారీగా జనం రావడంతో ప్రజలు ఒకరినొకరు తోపుకుంటున్నారని… ఔట్లెట్ వద్ద ప్రత్యేక ఏర్పా ట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.