బ్లాక్లో ఆక్సిజన్ సిలిండర్ల విక్రయం
ముగ్గురు నిందితుల అరెస్ట్
మల్కాజిగిరి, ఏప్రిల్ 27: కరోనా నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థ ముసుగులో బ్లాక్మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్లను విక్రయిస్తున్న ముగ్గురిని రాచకొండ ఎస్ఓటీ, మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట అంజుమన్ కాలనీకి చెందిన వ్యాన్ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్లా, ఫలక్నుమాకు చెందిన మహ్మద్ మజార్, కంచన్బాగ్కు చెందిన సయ్యద్ ఆసిఫ్లు పాతబస్తీకి చెందిన మాస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ పేరిట ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్నారు. సోమవారం రాత్రి నైట్ పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు మౌలాలి జట్టీఎస్ వద్ద ఓమినీ వ్యాన్ వెళ్తుండగా అనుమానంతో దాన్ని ఆపి చూడగా.. ఐదు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. వారిని ప్రశ్నించగా సరైనా సమాధానం లేదు. దీంతో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని మంగళవారం రిమాండ్కు తరలించారు. ఒక్కొక్కటి 150 లీటర్ల సామర్థ్యం ఉన్నాయి.