హైదరాబాద్ : కోఠి సుల్తాన్ బజార్లోని ఇంద్రబాగ్లో ఉన్న హోల్సేల్ మెడికల్ షాపులపై లీగల్ అండ్ మెటలర్జీ డిపార్ట్మెంట్ అధికారులు శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రోగులను ఆసరాగా చేసుకున్న మెడికల్ వ్యాపారస్తులు.. అడ్డగోలుగా ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు లీగల్ అండ్ మెటలర్జీ అధికారులు మీడియాకు వెల్లడించారు. మాస్కులు, శానిటైజర్లపై ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తున్న మెడికల్ వ్యాపారస్తులకు జరిమానాలు విధించామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని మందులు, ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ…వ్యాపార సముదాయాలను కొనసాగించాలన్న ప్రభుత్వ నిబంధనలను సుల్తాన్ బజార్ ఇంద్రబాగ్లోని మెడికల్ షాపుల యజమానులు పాటించడం లేదు. భౌతిక దూరం పాటించుకుండా విక్రయాలు జరుపుతున్నారు. మాస్కులు ధరించకుండా మార్కెట్కు వస్తున్న వారికి పోలీసులు చలాన్లు విధిస్తున్నారు.