బేగంపేట జూలై 9 : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన అ మ్మవారి ఘటోత్సవాలు రేపటి నుంచి (ఆదివా రం) ప్రారంభించనున్నట్లు ఉజ్జయినీ మహంకాళి దేవాలయ కార్యనిర్వాహణధికారి గుత్తా మనోహార్రెడ్డి తెలిపారు. శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాలకమండలి సభ్యులతో కలిసి ఘటోత్సవాల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.
అనంతరం దేవాలయం నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమలతో అమ్మవారి విగ్రహాన్ని కర్భలామైదాన్ వద్దకు తీసుకెళ్లి అక్కడ ఘటం తయారు చేస్తారన్నారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు కర్భలామైదాన్ నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఘటాన్ని దేవాలయానికి తీసుకువస్తారన్నారు. 15వ రోజు జూలై 25న అమ్మవారి బోనాలు, 26న రంగం వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమ్మవారి జాతరను పురస్కరించుకొని దేవాలయంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
11వ తేదీ ఆదివారం ఉజ్జయినీ మహకాళి అమ్మవారి ఘటం మధ్యాహ్నం రెండు గంటలకు దేవాలయం నుంచి బయలు దేరి కర్భలామైదానంలో అలంకరణ పూర్తి చేసుకొని రాత్రి పది గంటలకు దేవాలయానికి చేరుకుంటుంది. 12న హిమంబావి, డొక్కలమ్మ దేవాలయం ప్రాంతాల్లో ఊరేగిస్తారు. 13న కళాసీగూడ, 14న నల్లగుట్ట, 15న పాన్బజార్, 16న ఓల్డ్ బోయిగూడ, 17న రంగ్రేజీ బజార్, 18న చిలకలగూడ, 19న ఉప్పర బస్తీ, 20న కుమ్మరిగూడ, 21న రెజిమెంటల్బజార్, 22న ఘటం దేవాలయంలోనే ఉంటుంది, 23న బోయిగూడ ఏరియాకు ఉదయం పది గంటలకు దేవాయలం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటల వరకు దేవాలయానికి చేరుకుంటుంది. అనతంరం 25న అమ్మవారికి బోనాలు, 26న రంగం వేడుకలు జరుగుతాయి.