అంబర్పేట, ఆగస్టు 2 : మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి.. కేవైసీ లింక్పై ప్రెస్ చేయండని ఫోన్కు వచ్చిన మెసేజ్ను చూసి లింక్పై ప్రెస్ చేసిన ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైన ఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మాకాలనీలో నివాసముండే బజార్ మహేంద్ర ప్రైవేట్ ఉద్యోగి. అతనికి విద్యానగర్లోని ఎస్బీఐ బ్యాం కులో సేవింగ్ అకౌంట్ ఉంది. సోమవారం మధ్యాహ్నం అతని అకౌంట్కు రూ. 8,800 క్రెడిట్ అయ్యాయని మెసేజ్ వచ్చింది. దాని కేవైసీ లింక్ పై వెంటనే ప్రెస్ చేయండని మరో మెసేజ్ వచ్చింది. అది చూసుకున్న మహేంద్ర ఆ లింక్పై ప్రెస్ చేశాడు. వెంటనే అతని అకౌంట్ నుంచి రూ.8,800 మాయమయ్యాయి. అతని అకౌంట్లో రూ.8800 క్రెడిట్ అయ్యాయని వచ్చిన మెసేజ్ తప్పని, తాను మోసపోయానని గ్రహించి వెంటనే బ్యాంకుకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియ జేశాడు. బ్యాంక్ వాళ్లు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించా రు. అనంతరం ఆయన నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.