కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరుకోగా, విదేశీ ఆటగాళ్లందరూ స్వదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అక్కడే క్వారంటైన్లో ఉన్నారు. ఐతే ఐపీఎల్ -2021లో ఆడిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్కు జట్టులో స్థానం లభించకపోవచ్చు. ఆటగాళ్లకు విరామం ఇవ్వాలనే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.
దీంతో ఐపీఎల్లో పాల్గొన్న జోస్ బట్లర్, జానీ బెయిర్స్టో, సామ్ కరన్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, అందరూ ఐపీఎల్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడారు. యూకేకు వెళ్లిన తర్వాత 10 రోజుల క్వారంటైన్లో ఉన్నారు. తక్కువ సమయంలో క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు టెస్టు సిరీస్కు సిద్ధమవడం కష్టమేనని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. లండన్లోని లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభంకానుంది.