కొండాపూర్ : వ్యాక్సినేషన్తోనే కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోగలమని శేరిలింగంపల్లి సర్కిల్ -20 ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి పేర్కొన్నారు. బుధవారం సర్కిల్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ ప్రేమ్నగర్ కాలనీలోని బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన పరిశీలించారు. కొవిడ్ నుంచి రక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కాలనీలలోనే వ్యాక్సినేషన్ డ్రైవ్లను ప్రారంభించినట్లు తెలిపారు.
వ్యాక్సిన్ కొరకు దూరం వెళ్ళకుండా నివాసముంటున్న కాలనీలోనే అందజేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు. ప్రేమ్నగర్ కాలనీలో 400 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, కొవిడ్ ప్రమాధం పూర్తిగా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులను వినియోగిస్తూ భౌతికదూరాలు పాటించాలన్నారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్లో టీకా తీసుకునేందుకు వచ్చిన కాలనీ వాసులు
హఫీజ్పేట్ : కోవిడ్ మహమ్మారినుంచి రక్షించుకోనేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొబైల్వ్యాక్సిన్డ్రైవ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హఫీజ్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు గౌతంగౌడ్ అన్నారు. ఇందులోబాగంగా ఓల్డ్హఫీజ్పేట్లోని భూలక్ష్మమ్మ ఆలయంవద్ద ఏర్పాటుచేసిన మోబైల్వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పర్యవేక్షించారు.
పట్టణ ప్రాధమిక ఆరోగ్యవైద్యకేంద్రం హఫీజ్పేట్ పరిధిలో మోబైల్వ్యాక్సినేషన్డ్రైవ్ రెండోరోజు విజయవంతంగా సాగింది. ఈకార్యక్రమంలో బాగంగా బుధవారం మొత్తం 812 మందికి కోవిడ్ టీకాలు అందజేసినట్లు ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్ డా. వినయ్బాబు తెలిపారు.
ఆయా మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల్లో మాదాపూర్ డివిజన్ ఇజ్జత్నగర్ 125, మియాపూర్ డివిజన్ స్టాలిన్నగర్ 300, హఫీజ్పేట్ డివిజన్ ఓల్డ్హఫీజ్పేట్ 260, చందానగర్ డివిజన్ ఇందిరానగర్ 127 మందికి రెండోరోజు టీకాలు వేసినట్లు ఆయన పేర్కోన్నారు. కార్యక్రమంలో డా. వినయ్బాబు ఇతర సిబ్బంది, నాయకులు శ్రీనివాప్ గౌడ్, వెంకటేష్గౌడ్ తదితరులు పాల్గోన్నారు.