సిటీబ్యూరో, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): వృత్తి నైపుణ్యం పెంపునకు పూర్వ విద్యార్థుల తమ సహకారం అందించడం ఆనందంగా ఉందని కేఎల్ యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్, స్కిల్ డెవలప్మెంట్ విభాగాధిపతి డాక్టర్ కృష్ణ కుమారి అన్నారు. విశ్వవిద్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు లో ప్రముఖ ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉన్నత పదవుల్లో ఉన్న పూర్య విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనలిటికల్, లాజికల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. గ్రూప్ డిస్కషన్లో విద్యార్థులు, వివిధ రీసెర్చ్ విభాగాధిపతులు అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానమిచ్చారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అలూమ్ని డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, ఇంజినీరింగ్ విభాగ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వర్ రావు, బిజెనెస్ స్కూల్ విభా ప్రిన్సిపాల్ డాక్టర్ కునాల్ గౌరవ్ తదితరులు పాల్గొన్నారు.