కరోనా నియంత్రణకు ప్రజల సహకారం చాలా అవసరం
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి
సుల్తాన్బజార్, ఏప్రిల్ 24: కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో అరికట్టాలం టే ప్రజల సహకారం ఎంతో అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం కొవిడ్ సెంటర్లను సంద ర్శించే క్రమంలో కింగ్ కోఠి కొవిడ్ సెంటర్ను ఆయన పర్యవేక్షించారు. దవా ఖానాలోని అన్ని వార్డులలో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవల గురిం చి తెలుసుకున్నారు. దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్నాథ్, కొవిడ్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జున్లతో కలిశారు. అంతే కాకుండా, పలు వార్డులలో రోగులతో నేరుగా అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఐతే, రోగుల వెంట రోగి సహాయకులు ఉండకుండా చూసేలా చర్యలు తీసు కోవాలని దవాఖాన పాలక వర్గానికి తెలిపారు.
అనంతరం ఆయన దవాఖాన కారిడార్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ, కొవిడ్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు భేష్ అని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటించ డంతో కరోనాను అంతం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలంతా భయాన్ని వీడి వ్యాక్సినేషన్ను తీసుకోవాలన్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ళు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ను ఇచ్చేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకున్నాయన్నారు. కింగ్కోఠిలో రోగులకు అందుతున్న సేవలు అత్యుత్తమమన్నారు. కరోనా ఫ్రంట్ వారియర్స్గా వైద్యులు అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోగులకు సేవలందించడంపై ఆయన దవా ఖానా పాలక వర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు