బన్సీలాల్పేట్, జూన్ 6 : హైదరాబాద్లో తయారవుతున్న వ్యాక్సిన్లు ఎంతో నాణ్యమైనవని.. ప్రతిఒక్కరూ ధైర్యంగా టీకాలు వేయించుకొని కరోనా నుంచి రక్షించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం బన్సీలాల్పేట జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని కార్పొరేటర్లు సీహెచ్.సుచిత్ర, కె.దీపికలతో కలిసి ఆయన పరిశీలించారు. జీహెచ్ఎంసీ నార్త్ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్రెడ్డి, బేగంపేట డీసీ ముకుందరెడ్డితో మాట్లాడి వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయడంలో ప్రపంచంలోనే ఇండియా నంబర్ వన్గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు ‘బయోలాజికల్ ఇ’ తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. అంతేకాక వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి, మందుల సరఫరాను మెరుగుపర్చడంతో పాటు అలాగే రేషన్ దుకాణాల ద్వారా నిరుపేదలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ తహసీల్దార్ కె.బాలశంకర్, బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు బి. శ్యామ్సుందర్ గౌడ్ పాల్గొన్నారు.