అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది

ఖైరతాబాద్ : వివాహేతర సంబంధంతో భర్తను కడతేర్చింది... ప్రియుడితో కలిసి పకడ్బందీగా హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించింది... బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... అసలు విషయం వెలుగులోకి వచ్చిం ది.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు విజయ్ భాస్కర్ రెడ్డి, నాగరాజు, యండి జాహెద్తో కలిసి వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ర్టానికి చెందిన లక్ష్మణ్ జా (30), కుష్బు దేవి దంపతులకు ఇద్దరు కుమారులు. గత రెండేండ్ల క్రితం నగరానికి వచ్చి సోమాజిగూడ డివిజన్, రాజ్నగర్ మక్తాలో ఉంటున్నారు. లక్ష్మణ్ రాత్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే.. ఉదయం జ్యూస్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఏడాది క్రితం సహాయకుడిగా దూరపు బంధువైన ఖైరతాబాద్లో నివాసం ఉండే లాల్ బాబు ను పనిలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కుష్బుకు.. లాల్ బాబుతో ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది.
వివాహేతర సంబంధానికి లక్ష్మణ్ అడ్డుగా ఉన్నాడని.. అతడిని అడ్డు తొలగించుకోవానుకున్నది. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్ జా పడుకోగా.. కుష్బు ప్రియుడితో కలిసి భర్త గొంతు నులి మి, చున్నీతో ఉరివేసి హతమర్చాడు. అనంతరం ఖైరతాబాద్లో నివాసం ఉండే మృతుడి సోదరుడు బీహారీ జాకు ఫోన్ చేసి లక్ష్మణ్ నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. అతడికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో అది హత్య అని తేలింది. కుష్బును అదుపులోకి తీసుకుని విచారించగా తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నది. ఇద్దరిని రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా
- 14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి
- మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఒకవైపు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక.. మరోవైపు ఇద్దరు హత్య
- మీరు ఎదిగి పదిమందికి సాయపడాలి : ఎమ్మెల్సీ కవిత
- వాట్సాప్లో కొత్త ఫీచర్.. అదేమిటంటే..