ఖైరతాబాద్, సెప్టెంబర్ 17 : ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జన ఘట్టం ఆదివారం జరుగనున్నది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాలను ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ముందస్తుగా ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రమే గణనాథుడు ఆశీనులయ్యే ట్రాలీని సిద్ధం చేయగా, దానిపై అమర్చేందుకు అనువుగా ఉండేందుకు ఐరన్ రాడ్స్కు వెల్డింగ్ పనులు చేపట్టారు. గణేశుడిపై ఉన్న షెడ్ల తొలగింపు పనులు కూడా మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామును కర్రలను తొలగిస్తారు.
అదే రోజు రాత్రి 12గంటల తర్వాత ట్రాలీ, భారీ క్రేన్ అక్కడకు చేరుకుంటాయి. ఆ తర్వాత గణపతి ఎదుట ఉన్న కలశాన్ని కదిలిస్తారు. మరుసటి రోజు ఆదివారం ఉదయం 3 నుంచి 4 గంటలకు మధ్య ప్రత్యేక పూజలు చేస్తారు. ఉ.6గంటలకు విగ్రహాన్ని ట్రాలీ మీద పెట్టి వెల్డింగ్ ప్రారంభిస్తారు. ఉ. 8గంటల నుంచి గంటపాటు ట్రాలీని అలంకరించి, ఉ. 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మ. 12 గంటలకు నిర్ణీత క్రేన్ వద్దకు చేరుకుంటుంది. మ.3 నుంచి 3.30 గంటల మధ్య నిమజ్జనం చేస్తామని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ తెలిపారు.
1957 నుంచి 2021 వరకు ఖైరతాబాద్ గణేశుడికి అదే క్రేజ్ ఉంది. గణపతి మండపంలో ఒక్క అడుగు పెట్టినా….లక్షలాదిగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు…ఆ స్థల మహత్యం అలాంటిది. దేశంలో 70 నుంచి 90 అడుగులపైగా ఎత్తున్న గణేశ్ విగ్రహాలు ఉన్నాయి. కానీ అక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చిన సందర్భాలు లేవు. ఖైరతాబాద్ గణేశుడికి ఓ ప్రత్యేక ఉంది.. ఆయన కండ్లతోనే నిజరూప దర్శనం ఇస్తారు. తక్కువ ఎత్తులో పెట్టినా భక్తుల సంఖ్యలో తేడా ఉండదు. మట్టి విగ్రహం ఎవరు ప్రతిష్టించినా ఆగమ శాస్త్రం ప్రకారం నీటి తొట్టిలో కరిగించి ఆ నీటిని చెరువులో పోయాలి. నీరు రోడ్డుపై పారకుండా చూడాలి. తొమ్మిది రకాల అభిషేకాలు చేయాలి. ఖైరతాబాద్ మహాగణపతి గురించి ఇప్పుడే చెప్పలేను. వచ్చే ఏడాది కర్రపూజ సమయంలో అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. మహాశిల్పి రాజేంద్రన్
ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతికి తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు శుక్రవారం వంద కిలోల లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. కాగా బడా గణపతి నిమజ్జనం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు క్రేన్ వద్దకు చేరుకొని, వెల్డింగ్ పనుల అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్య నిమజ్జనం చేస్తామని గణేశ్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్రాజ్ తెలిపారు.