సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కొవిడ్ రోగులను ఆదుకునేందుకు కరూర్ వైశ్యా బ్యాంక్ ముందుకొచ్చింది. సీఎస్ఆర్ పథకంలో భాగంగా రూ. 20 లక్షలతో దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రి ప్రాంగణంలో తాత్కాలిక కొవిడ్ సెంటర్కు ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు తొలుత రూ. 10 లక్షలను సాక్షం జాతీయ జాయింట్ సెక్రటరీ డాక్టర సంతోశ్కుమార్, సాక్షం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ విజయ్ బీకు, కరూర్ వైశ్యా బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ రామకృష్ణ అందించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ, సీఈవో బి. రమేశ్బాబు మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కరూర్ వైశ్యా బ్యాంక్ ఇప్పటి వరకు రూ.4.61 కోట్లను కరోనా సెకండ్ వేవ్ సమయంలో అందించదన్నారు. మహమ్మారిని అంతమొందించేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరుకు బ్యాంకు మద్దతు ఇస్తుందని వారు తెలిపారు.
సుల్తాన్బజార్, జూన్ 8: ఉస్మానియాకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు చేయూత అందించడం అభినందనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. మంగళవారం ఉస్మానియా వైద్యశాలకు గ్లాండ్ ఫార్మా, బాల వికాస్ సంస్థలు సంయుక్తంగా రూ.14 లక్షలు విలువ చేసే హై 3 ప్రోబ్ అల్ట్రా సౌండ్ యంత్రాన్ని అందజేశాయి. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ అతి కీలకమైన అల్ట్రా సౌండ్ యంత్రాన్ని విరాళంగా అందించిన గ్లాండ్ ఫార్మా, బాల వికాస్ ఎన్జీవో సంస్థల ప్రతినిధులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో దవాఖాన సీఎస్ అడ్మిన్ ఆర్ఎంవో డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ సాయి శోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, ఆర్ఎంవోలు డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ సిద్ధిఖీ, డాక్టర్ మాధురి, డాక్టర్ అనురాధ, డాక్టర్ కవిత, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ సుష్మ, గ్లాండ్ ఫార్మా ప్రతినిధులు కె.రఘురాం, గిరిష్ సుబ్బరాజు పాల్గొన్నారు.