మన్ప్రీత్ సింగ్
బెంగళూరు: టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించి కరోనా యోధులకు అంకితమివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ చెప్పాడు. కరోనా నుంచి లక్షలాది మందిని కాపాడేందుకు దేశంలో డాక్టర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారని హాకీ ఇండియా విడుదల చేసిన ఓ వీడియోలో మన్ప్రీత్ పేర్కొన్నాడు. ‘టోక్యో ఒలింపిక్స్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాం. దేశం కోసం పతకం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నా. ఒకవేళ మెడల్ గెలిస్తే.. నిజమైన హీరోలైన డాక్టర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు అంకితమివ్వాలనుకుంటున్నాం. లక్షలాది మంది ప్రాణాలను వారు కాపాడారు’ అని మన్ప్రీత్ అన్నాడు.