ఖైరతాబాద్, సెప్టెంబర్ 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో పేదింట్లో కల్యాణకాంతులు నిండుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమాజిగూడ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వనం సంగీత యాదవ్తో కలిసి పంపిణీ చేశారు. ఎంఎస్మక్తా కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీసీ వంశీ, ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.