కాచిగూడ,సెప్టెంబర్ 7: సంఘసేవకురాలు కాలేరు రాములమ్మ తెలంగాణ రాష్ర్టానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్లో ఏర్పాటు చేసిన కాలేరు రాములమ్మ సంస్మరణ సభలో ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే కాలేరు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, గోల్నాక మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మ, తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అహర్నిషలు కృషి చేసిన గొప్ప మనిషని పేర్కొన్నారు. అదే విధంగా వివిధ రాజకీయపార్టీల నేతలు, అభిమానులు, కుల బంధువులు కాలేరు రాములమ్మ చేసిన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కాలేరు ీరేశం, కాలేరు శ్రీనివాస్రావు, కాలేరు రాజు, విఠలేశ్, జీహెచ్ఎంసీ మాజీ ప్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, దూసరి శ్రీనివాస్గౌడ్, కాలేరు రామకృష్ణ, విజితారెడ్డి, హరినాథ్రెడ్డి, దోర్నాల యాదగిరిముదిరాజ్, వార్డు సభ్యుడు కాశీ నరేశ్, రాజన్, అప్పశ్రీనుతో పాటు అభిమానులు పాల్గొన్నారు.