బంజారాహిల్స్,ఆగస్టు 12: జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ పాలకమండలిలో విభేదాలు భగ్గుమన్నాయి. బుధవారం జరిగిన సొసైటీ పాలకమండలి సమావేశం లో తనపై అధ్యక్షుడు రవీంద్రనాథ్తో పాటు కొంతమంది సభ్యులు ఒత్తిడి తీసు కువచ్చారంటూ సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫి ర్యాదు చేశారు. రికార్డు గది తాళాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదుతో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు.
సహకారశాఖకు ఫిర్యాదు..
మార్చిలో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సొసైటీ పాలకమండలి సొసైటీ అధ్యక్షుడిగా రవీంద్రనాథ్, కార్యదర్శిగా మురళీముకుంద్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇటీవల కొన్ని అంశాల్లో పాలమండలి సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన పాల కమండలి సమావేశంలో రసాభాసా చోటు చేసుకుంది.
అధ్యక్షుడు రవీంద్రనాథ్ తదితరులు తనవద్దనుంచి రికార్డు రూమ్ తాళాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని, సొసైటీ బైలాస్ ప్రకారం కార్యదర్శివద్దనే తాళాలు ఉండాలని ఉందని, వాటిని రక్షించాల్సిన బాధ్యత తనమీద ఉందంటూ సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్ సహకారశాఖ కమిషనర్తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.