సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రభూమి ఎడిటర్గా పని చేసిన సీనియర్ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ (62) శుక్రవారం ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మరిణించారు. అయన ఈనాడు, ఆంధ్రప్రభ, కృష్ణపత్రిక, హిందీమిలాప్ వంటి పత్రికలలో సేవలు అందించారు. ఈ మేరకు ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన పత్రిక రంగంలో సేవలు అందించారు. ఆయనకు భార్య కుమార్తె ఉన్నారు. అయితే గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు రాత్రి ఆసుపత్రిలో చేర్పించారు.
అయన పలువురు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించారు. సదాశివశర్మ తండ్రి ముళ్లపూడి సూర్యనారాయణ, ప్రముఖ సాహితీవేత్త, వికారాబాద్లో అధ్యాపకునిగా పని చేస్తూ జాతీయ సాహిత్య పరిషత్తు ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. సదాశివశర్మ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.