సిటీబ్యూరో,ఏప్రిల్26 (నమస్తేతెలంగాణ): గాంధీ దవాఖానతోపాటు హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వైద్య సేవలు అందించేందుకు అర్హత, ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటి ఒక ప్రకటనలో తెలిపారు. 3 నెలలు తాత్కాలిక పద్ధతిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, జిల్లా అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని, ఈనెల 28న సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావాలని సూచించారు. సివిల్ సర్జన్ (అనష్థీషియా)-16, సివిల్సర్జన్ (జనరల్) మెడిసిన్-13, సివిల్ సర్జన్ (పల్మనరి మెడిసిన్)-8, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్-2, ల్యాబ్ టెక్నీషియన్స్-28 పోస్టులు ఉన్నట్లు తెలిపారు.