సుల్తాన్బజార్,ఆగస్టు 3: నిరుద్యోగ యువతీ,యువకులకు ప్రైవేట్ రంగాల్లో ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ఈనెల 5న జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.నగరంలోని ప్రముఖ సంస్థలైన పేటీఎం,కొంపల్లి డాటా సొల్యూషన్స్లో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్,రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్,మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర ఉద్యోగాల భర్తీకి జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు,పదో తరగతి,ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ మల్లేపల్లి ఐటీఐ ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూల కోసం ఉదయం 11గంటలకు హాజరు కావాలని కోరారు.సమాచారం కోసం యంగ్ ప్రొఫెషనల్ టి రఘుపతి-8247656356 నంబర్ను సంప్రదించాలని కోరారు.