మారేడ్పల్లి, ఆగస్టు 19 : స్థానిక యువతకు ఉపాధి కల్పనతో మంచి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారు జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషకరమని టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం కంటోన్మెంట్ నాలుగో వార్డులోని రాష్ట్రీయ మాద్యమిక శిక్షణ అభియాన్ పికెట్లో స్థానిక మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్ ఆధ్వర్యంలో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారి సహకారంతో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ..స్థానిక యువతి, యువకులకు ఉపాధి కల్పనతో మంచి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారితో జాబ్ మేళా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమం ద్వారా బస్తీలోని యువత అవకాశాలను అందిపుచ్చుకొని మంచి భవిష్యత్ నిర్మించుకోవాలన్నారు.
జాబ్ అవకాశం వచ్చిన యువతకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ బోర్డు ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఎండీ కె.ఎ స్రావు, హెచ్ఆర్ శ్రీనివాస్, స్థానికులు ప్రవీణ్, గంగారాం, ప్రవీణ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.