సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రణాళిక, పాలనలో జియోస్పేషియల్ టెక్నాలజీ ఎంతో కీలకమని, దాన్ని విస్తృతంగా వినియోగించేలా నిపుణులు కృషి చేయాలని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ అన్నారు. జియోమాటిక్స్ ఫండమెంటల్స్పై ఐదు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ముగింపు కార్యక్రమాన్ని శనివారం ఆన్లైన్ వేదికగా నిర్వహించారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. నిరంతర అభ్యాసం, స్వల్ప కాలిక శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఫ్యాకల్టీ సభ్యులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.
ఆన్లైన్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జేఎన్టీయూ హైదాబాద్ ఐఎస్టీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.విజయలక్ష్మి సమన్వయ పరిచారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శశికళ, రిసోర్స్ పర్సన్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ రాజు, డాక్టర్ గణేశ్, డాక్టర్ మంజుశ్రీ, డాక్టక్ పి.కేశవ రావు, అబ్దుల్ మొయిద్, అభిలాశ్ సచిన్లతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 200 మంది పాల్గొన్నారు. ఏఐసీటీఈ, అటల్ ఆధ్వర్యంలో జియోస్పేషియల్ టెక్నాలజీలో ప్రస్తుత స్థితి, భవిష్యత్తు పోకడలపై ప్రధానంగా చర్చించారు. రిమోటా సెన్సింగ్ జీఐఎస్ డేటా ఉత్పత్తులకు సంబంధించిన వివిధ అంశాలపై నిపుణులు మాట్లాడారు. ఎస్ఆర్ఎస్ఈ, ఇన్కాయిస్, అన్నా విశ్వవిద్యాలయం, ఎన్ఐఆర్డీపీఆర్, జేఎన్టీయూ హెచ్ల నుంచి నిపుణులు ఆన్లైన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.