కేపీహెచ్బీ కాలనీ, జూన్ 4 : జవహర్లాల్నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎన్విరాల్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఈపీటీఆర్ఐ)ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. శుక్రవా రం జేఎన్టీయూహెచ్ వర్సిటీలో వైస్ చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదార్ సిన్హా లు అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశారు. పట్టణాలలో భూగర్భ నీటి నిల్వల పెంపు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై పరస్పరం సహకారాన్ని అందించుకోవాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ రంగాలలో శిక్షణా కన్సల్టెన్సీ, అనువర్తిత పరిశోధన సేవలు మరియు న్యాయవాదనలను అందించడమే అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రెక్టార్ గోవర్దన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, మాధవిలత, కృష్ణమోహన్, గిరిధర్, పురుశోత్తం పాల్గొన్నారు.