ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను దోపిడీ చేసేందుకు యత్నించిన ఓ పాల వ్యాపారికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీనగర్ రెండో అదనపు సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు వెల్లడించారు. రాచకొండ పోలీసుల కథనం ప్రకారం.. 2014, జూలై 1న నేరేడ్మెట్కు చెందిన పాల వ్యాపారి వల్లపు బాల్రాజ్.. ఈస్ట్ కాకతీయ నగర్, జేకే కాలనీకి చెందిన కృష్ణవేణి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసి చం పేందుకు యత్నించాడు. ఆమె పెద్దగా అరవడంతో స్థానికులు వచ్చి ఆమెను కాపాడారు. దీనిపై కేసు నమోదు చేసుకొన్న నేరేడ్మెట్ పోలీసులు దర్యాప్తు చేపట్టి చార్జ్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి మూడేండ్ల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పిందని పోలీసులు వెల్లడించారు.
మహేశ్వరం మండలం రావిరాలకు చెందిన రావుగల్ల అమరేందర్ 2017, అక్టోబర్ 17న జేసీబీతో రోడ్డుకిరువైపులా ఉన్న పొదలను శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఎరుకుల సదాశివుడు, ఎరుకల సాంబశివుడు, ఎరుకల గోపాల్లు కులం పేరుతో అమరేందర్ను దూషించడంతో పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసుకొని అప్పటి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి కేసు దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ వేశారు. ఈ కేసులో శుక్రవారం ఎల్బీనగర్ ఎస్సీ/ఎస్టీ కోర్టు నిందితులకు యేడాది జైలు శిక్ష ఖరారు చేసి, జరిమానాలు విధించిందని రాచకొండ పోలీసులు వెల్లడించారు.