కవాడిగూడ, జూలై 12: హరేరామ హరేకృష్ణ రామరామ హరేహరే అంటూ వందలాది భక్తుల నినాదాలలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. భక్తజనం రంగురంగుల పూలతో రథయాత్రకు స్వాగతం పలికారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రత్యేంగా అలంకరించిన వాహనంలో పూర్ణకుంభాన్ని ఉంచి రథయాత్ర నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమై.. ఇందిరాపార్కు చౌరస్తా, అశోక్నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్నగర్, బషీర్బాగ్ మీదుగా అబిడ్స్లోని ఇస్కాన్ దేవాలయానికి చేరుకుంది. కోలాటాలు, నృత్యాలు, భక్తిగీతాల మధ్య కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు వేదాంత చైతన్యదాస్, రాధేశ్యామ్దాస్, వరదాకృష్ణదాస్, సెక్రెటరీ శంభు వైష్ణవ్దాస్ల ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించారు.