కేవీకే వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి
రుద్రూర్, జనవరి12 : రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని కేవీకే వా తావరణ విభాగం శాస్త్రవేత్త శ్రీలత తెలిపారు. గురువారం నుంచి మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉ న్నందున రైతులు పొలంలో రసాయన ఎరువులు వాడకూడదని తెలిపారు.అంతే కాకుండా పాడి గేదెలను పశుగ్రాసం కోసం బహిరంగ ప్రదేశాలకు తరలించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. రైతులు ముందుగానే వర్షపాతం గురించి తెలుసుకోవాలంటే రెయిన్ అలార్మ్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ యాప్ ద్వారా వర్ష సూచనను 15 నిమిషాల ముందుగానే అలా ర్మ్ ద్వారా సమాచారం తెలియజేస్తుందని తెలిపారు.