సమకూర్చిన పువ్వాడ ఫౌండేషన్, ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా
ఖమ్మంలో కలెక్టర్కు అందించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, జూన్ 2: కరోనా బాధితులను ప్రాణాపాయస్థితి నుంచి కాపాడేందుకు ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని పోలీసు పరేడ్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం పువ్వాడ ఫౌండేషన్, ఖమ్మం, ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా (ఐఎఫ్ఏ) సంయుక్త ఆధ్వర్యంలో సమకూర్చిన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు మంత్రి అజయ్ అందించారు. ఈ కాన్సన్ట్రేటర్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆసుపత్రులు, హోం ఐసొలేషన్లో ఉండి ఆక్సిజన్ అవసరం అయిన వారికి వినియోగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్కు సూచించారు. కొవిడ్ చికిత్స పొంది కోలుకున్న వారికి అవసరమైతే ఇంటి వద్ద కూడా అందిస్తామన్నారు. వారి అవసరాల అనంతరం మరొకరికి అందజేస్తామని వివరించారు. కలెక్టర్ కర్ణన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సీపీ విష్ణు ఎస్ వారియర్, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కమిషనర్ అనురాగ్ జయంతి, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీఓ రవీంద్రనాథ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసి కృష్ణ, కార్పొరేటర్లు కర్నాటి కృష్ఱ, కమర్తపు మురళి, పసుమర్తి రామ్మోహన్రావు, టీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, తోట రామారావు, కన్నం ప్రసన్న, నల్లమల వెంకటేశ్వరరావు, చింతనిప్పు కృష్ణచైతన్య, అర్బన్ తహసీల్దార్ శైలజ పాల్గొన్నారు.