కాచిగూడ,సెప్టెంబర్ 7 : ఉపాధి అవకాశాలు గల టైలరింగ్ వృత్తి విద్యా కోర్సులకు మహిళల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పింక్ పెటల్స్ డైరెక్టర్ యు.గీత ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం బర్కత్పుర కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు, మహిళలు 45 రోజుల పాటు టైలరింగ్ వృత్తి విద్యా కోర్సులకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
శిక్షణ పొందిన విద్యార్థులు, మహిళలకు బెస్ట్ ఫర్పామెన్స్ సర్టిఫికెట్స్ అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన ఆసక్తి గల మహిళలు ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. వివరాలకు 9030610044లో సంప్రదించవచ్చని కోరారు.