సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 ( నమస్తే తెలంగాణ ) : నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ కో ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లోమా, పోస్ట్ డిప్లోమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్టు, పెనైట్రేషన్ టెస్టర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట, ఐటీ సెక్యూరిటీ ఇంజినీర్, సెక్యూరిటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ తదితర ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వివరించారు. మరిన్ని వివరాలకు 7893141797 సంప్రదించాలని కోరారు. ఈనెల 4 వరకు గడువు ఉందని తెలిపారు.