తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వకారణమని విశ్వ తెలుగు సాహిత్య సాంస్కృతిక సభ అధ్యక్షుడు వల్లూరి రమేష్ తెలిపారు. శనివారం బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వల్లూరి రమేష్ మాట్లాడుతూ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఏప్రిల్ 12న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు సంస్కృతి వారసత్వ దినంగా అధికారికంగా గుర్తించారని ఆయన తెలిపారు. దీంతో అమెరికాలోని పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యాంశాలు తెలుగులో బోధించేందుకు వీలు కలిగిందన్నారు. జార్జియా రాష్ట్రంలో తెలుగు భాషను బోధించవచ్చన్నారు. జార్జియా రాష్ట్ర గవర్నర్ కెంప్ అంతర్జాతీయ తెలుగు దీప్తి బిరుదును అందజేయడం సంతోషకరమని తెలిపారు. జార్జియా రాష్ట్రంలో తెలుగు భాషకు గొప్ప సత్కారం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సంఘటన అని ఆయన పేర్కొన్నారు.