చార్మినార్, ఆగస్టు 12: అంతర్జాతీయ గజరాజుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జూపార్క్లో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జూలోని ఏనుగులతో రాగులు, బియ్యంతో తయారు చేసిన కేక్లను కట్ చేయించిన జూ అధికారులు ఘనంగా ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జూలో ఓ మగ ఏనుగుతో పాటు మరో 3 ఆడ ఏనుగులు సందర్శకులను అలరిస్తున్నాయని జూపార్క్ క్యూరేటర్ సుభద్రాదేవి తెలిపారు.